NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొన‌సాగుతున్న వ‌ర‌ద ప్ర‌వాహం.. తుంగ‌భ‌ద్ర నుంచి నీటి విడుద‌ల !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు జలాశయం 20 గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా… ప్రస్తుతం నీటి మట్టం 1632.34 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 72618 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 90865 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలకు గాను… ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 103.138 టీఎంసీలుగా కొనసాగుతోంది.

                                                

About Author