PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వమిత్వ సర్వేకు సహకరించండి

1 min read

జిల్లా పంచాయతీ రాజ్​శాఖ అధికారి టి. నాగరాజు నాయుడు

పల్లెవెలుగు: కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో జరుగుతున్న స్వమిత్వ సర్వే (అబాది) కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు జిల్లా పంచాయతీ రాజ్​శాఖ అధికారి టి. నాగరాజు నాయుడు. గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామ కంఠం నందు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, వ్యక్తిగత ఇళ్లు, ఖాళీ స్థలములను కొలతలు వేయుటకు స్వమిత్వ సర్వే బృందం వారు గ్రౌండ్​ ట్రూతింగ్​ మరియు సర్వేలోని వివిధ దశలలో భాగంగా నోటీసులు జారీ చేయు సమయంలో సంబంధిత ఆస్తుల యజమానులు అందుబాటులో ఉండి వారి వారికి సంబంధించిన ఆస్తుల యొక్క ధ్రువ పత్రముల నకళ్లను సర్వే టీము వారికి అందజేయాలని  ఆదివారం ఓ ప్రకటనలో డిపిఆర్​ఓ నాగరాజు నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వమిత్వ సర్వే (అబాది) కి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.

About Author