PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘వర్క్​ టు రూల్​’కు సహకరించండి..

1 min read

కలెక్టర్​ను కోరిన ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్​ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​:ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్ట్​ మరియు ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన  ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా రాష్ట్ర పిలుపు మేరకు  ఈ నెల 21 నుంచి ప్రతి ఉద్యోగి వర్క్​ టు రూల్​ పాటించాలని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి చరిత్రహీనులుగా మారొద్దని కోరారు ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి. మంగళవారం కర్నూలు కలెక్టర్​ పి. కోటేశ్వర రావును ఆయన ఛాంబరులో APRSA సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. వర్క్​ టు రూల్​కు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.  అనంతరం కలెక్టర్​కు మెమోరాండం అందజేశారు. ఆ తరువాత జాయింట్​ కలెక్టర్​ రామ్​సుందర్​ రెడ్డికి, డీఆర్​ఓ నాగేశ్వరరావు యాదవ్​కు వినతిపత్రం సమర్పించారు.  అనంతరం డ్వామా, డీఆర్​డీఏ, రెవెన్యూ, ఐసీడీఎస్​, విద్యాశాఖ తదితర శాఖల అధికారులకు వర్క్​ టు రూల్​ పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి మాట్లాడుతూ వర్క్​ టు రూల్​లో భాగంగా ప్రతి ఉద్యోగి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తించాలని కోరారు.  ఆ తరువాత ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​లో విధులు కొనసాగించరాదని, అలాచేస్తే డ్యాష్​ బోర్డులో అది రిఫ్లెక్ట్​ అవుతుందని వెల్లడించారు. సాయంత్రం 5 గంటల తరువాత విధులు నిర్వర్తిస్తే…ఏపీ​ఆర్ఎస్​​ఏ నేతృత్వంలో చేపడుతున్న ఉద్యమం నీరుగారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

About Author