PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమిష్టి కృషితో రోడ్డు ప్రమాదాలు నియంత్రించండి : జిల్లా ఎస్పీ

1 min read

– ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పై చర్యలు తప్పవు .
– జాతీయ రహాదారుల పై రాంగ్ రూట్ లలో వెళ్ళవద్దు.
– వాహనదారులు తమ భద్రతకు పోలీసుల సూచనలు పాటిస్తూ గమ్యాలకు క్షేమంగా చేరాలి.
– తరులకు , తమకు ప్రాణనష్టం జరగకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన చేసేలా చర్యలు చేపట్టాలని, జరిమానాల కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు తెలిపారు.( ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు ) గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను సోమవారం విడుదల చేశారు .
ఇందులో ప్రధానంగా: వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిపై 608 కేసులు.హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 7,761 కేసులు, మైనర్ల పై 55 కేసులు. ఒన్ వే లో రాంగ్ రూట్ వెళ్ళిన వారిపై 59 కేసులు.మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన వారి పై 176 కేసులు.జంపింగ్ సిగ్నల్ పై 7 కేసులు.ఏలాంటి రికార్డులు పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి పై 10,086 కేసులు.సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న కార్లు , జీపులు , తదితర వాహన చోదకుల పై 572 కేసులు.అతి వేగంతో వెళ్లి న వాహనాల పై 2,054 కేసులు. ఓవర్ లోడ్ తో వెళ్ళిన వాహనాల పై మోటారు వాహనాల చట్టం కింద 300 కేసులు.ట్రిపుల్ రైడింగ్ పై 778 మంది కేసులు. రాంగ్ పార్కింగ్ చేసిన ద్విచక్రవాహానాల పై 837 కేసులు.రాంగ్ పార్కింగ్ చేసిన త్రీ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహానాల పై 490 కేసులు.నంబర్ ప్లేట్ లేని 375 వాహనాలు సీజ్ డ్రంకెన్ & డైవింగ్ పై 176 కేసులుమొత్తం 5 లక్షల 39 వేల ఈ – చలనాలు పెండింగ్ లో ఉన్నాయని , ఫిబ్రవరి నెలలో 25,976 ఈ – చలనాలను (రూ. 48 లక్షల 23 వేల 210 రూపాయలను) రికవరీ చేశామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగినా , రహదారులపై ఇబ్బందికరంగా వాహనాలు నిలిపినా వెంటనే డయల్ 100 కు సమాచారం చేరవేయాలని జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. పోలీసు అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు.జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ , స్పీడ్ బ్రేకర్లు సూచించేలా వంద మీటర్ల దూరం నుండే హెచ్చరికల బోర్డులు ఉండాలన్నారు . జాతీయ రహదారులపై స్పీడ్ గన్స్ తో వేగ నియంత్రణకు కృషి చేయాలన్నారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ , మైనర్ డ్రైవింగ్ లపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు . వీటితో పాటు హెల్మెట్ , సీటు బెల్టు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేలా … ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా , పరిమితికి మించి ప్రయాణీకులు వాహనాల్లో వెళ్ళకుండా పలు జాగ్రత్తలు చేపడితే దాదాపు రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు .వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు, సూచనలు పాటిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా గమ్యాలకు క్షేమంగా చేరాలని, ప్రాణనష్టం జరగకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఈ సంధర్బంగా జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

About Author