PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాంధీ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. స్వామీజీ పై దేశ‌ద్రోహం కేసు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చ‌త్తీస్ఘ‌డ్ రాష్ట్రం రాయ్ పూర్ కు చెందిన స్వామీజీ కాళీచ‌ర‌ణ్ మ‌హ‌రాజ్ మ‌హాత్మా గాంధీ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. గాంధీని హ‌త్య చేసిన నాథూరామ్ గాడ్సేకు వంద‌నం చేస్తాన‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదైంది. వివిధ వర్గాల మధ్య విద్వేషం, శత్రుత్వం, దురభిప్రాయాలను సృష్టించే వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసును రాయ్‌పూర్ పోలీసులు నమోదు చేశారు. రాయ్‌పూర్‌లోని రావణ్ భాటా మైదానంలో ఆదివారం జరిగిన ధర్మ సంసద్‌లో కాళీచరణ్ మహరాజ్ మాట్లాడుతూ, రాజకీయాల ద్వారా దేశాన్ని కబళించడమే ఇస్లాం లక్ష్యమని చెప్పారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు తాను వందనం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆయనను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

                                      

About Author