PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌రోన‌.. ఒక్క రోజే 51 మంది మృతి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చైనాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. బీజింగ్‌లో చయోయంగ్‌ ప్రాంతంలో కరోనా కేసులు పదుల్లో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇక్కడి 35 లక్షల మందికి మూడు విడతల్లో నిర్థారణ పరీక్షలు ప్రారంభించింది. బీజింగ్‌లో ఆదివారం బయటపడిన 14 కేసుల్లో 11 చయోయంగ్‌ జిల్లాలోనివేనని అధికారులు తెలిపారు. షాంఘైలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధికంగా మరో 51 కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. దీంతో, ఇక్కడ కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 138కి చేరుకుంది.

                                    

About Author