PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల‌కు క‌రోన బోన‌స్ !

1 min read

పల్లెవెలుగు వెబ్ : క‌రోన నేప‌థ్యంలో ఉద్యోగుల కృషికి గుర్తింపుగా మైక్రోసాఫ్ట్ సంస్థ క‌రోన బోన‌స్ ప్రక‌టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల‌కు 1500 డాల‌ర్లను సింగిల్ టైం బోన‌స్ గా ప్రక‌టించింది. కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ కంటే కిందిస్థాయి ఉద్యోగులకు ఈ క‌రోన బోన‌స్ వ‌ర్తిస్తుంది. మార్చి 31, 2021కి ముందున్న ఉద్యోగులందరికీ ఈ బోన‌స్ వ‌ర్తిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 1,75,508 మంది ఉద్యోగులు మైక్రోసాప్ట్ కు ఉన్నారు. వీరికి బోన‌స్ ఇవ్వడానికి 200 మిలియ‌న్ డాల‌ర్లు అద‌నంగా కేటాయించ‌నుంది. మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థల ఉద్యోగులు ఈ బోన‌స్ కు అర్హులు కాదు.

About Author