NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో పెరుగుతున్న క‌రోన కేసులు

1 min read

అమ‌రావ‌తి: ఏపీలో క‌రోన కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 42696 మందికి ప‌రీక్షలు నిర్వహించారు. వీరిలో 947 మందికి క‌రోన పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ఇప్పటి వ‌ర‌కు 8,97,810 మంది క‌రోన బారిన‌ప‌డ్డారు. ఈ మేర‌కు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 337 మంది క‌రోన నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 8,85,892 మంది క‌రోన నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. క‌రోన బారిన ప‌డి ఇప్పటి వ‌ర‌కు 7,203 మ‌ర‌ణించగా.. 4715 కేసులు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయ‌ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మ‌రో వైపు దేశ వ్యాప్తంగా కూడ క‌రోన కేసుల తీవ్రత పెరిగింది. మ‌హారాష్ట్రలో అత్యధికంగా క‌రోన కేసులు న‌మోద‌య్యాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడ మ‌హారాష్ట్రలో అధికంగా ఉంది.

About Author