PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరోనాకు.. చెక్​

1 min read
మాస్కులు పంపిణీ చేస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

మాస్కులు పంపిణీ చేస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

– మాస్కులు పంపిణీ చేసిన ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు క్రైం : రాష్ట్రంలో కరోనా స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో… పోలీస్​ యంత్రాంగం దానికి చెక్​ పెట్టేందుకు నడుం బిగించింది. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు.. జిల్లా ఎస్పీ డా. ఫక్కీరప్ప కర్నూలు నగరం ఆర్ ఎస్ రోడ్డు సర్కిల్​లో ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కోవిడ్​ నేపథ్యంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్కులు ధరించకుంటే.. జరిమానా వేస్తామని సుతిమెత్తగా హెచ్చరించారు. కోవిడ్​ పై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని, సెకండ్​ వేవ్​ విజృంభించకుండా .. అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్​ఐలు, సిబ్బందిప పాల్గొన్నారు.

About Author