PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మళ్లీ విస్తరిస్తోన్న కరోన

1 min read

పల్లెవెలుగువెబ్ : కరోనా మహమ్మారి కథ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో దానికి సంబంధించిన ఒక వార్త కలవరపాటుకు గురి చేస్తోంది. కరోనా వైరస్ కొత్త రూపాన్ని సంతరించుకుని మళ్లీ ఉనికిని చాటుకుంటోందనేదే ఆ వార్త. బీఎఫ్-7 అనే కరోనా సబ్ వేరియంట్ ను మన దేశంలో గుర్తించారు. గుజరాత్ బయోటెక్నాలజీ రీసర్చ్ సెంటర్ ఈ వేరియంట్ ను గుర్తించింది. ఈ వేరియంట్ తొలుత చైనాలో వెలుగు చూసింది. ఆ తర్వాత చాలా వేగంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, బెల్జియం దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ కు ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం ఉంది.

About Author