PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐపీఎల్ లో క‌రోన క‌ల‌వ‌రం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐపీఎల్ లో మ‌రోసారి క‌రోన క‌ల‌వ‌రం రేగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫిజియో ప్యాట్రిక్‌ ఫరాట్‌కు కరోనా సోకడం లీగ్‌లో కలకలం రేపింది. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫిజియో ప్యాట్రిక్‌ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలాడు. ప్రస్తుతం అతడు ఆ జట్టు వైద్య బృందం నిశిత పర్యవేక్షణలో ఉన్నాడు’ అని లీగ్‌ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. కరోనా కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’ దేశంలోకి ప్రవేశించిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో ఐపీఎల్‌లో వైరస్‌ బయటపడడం ఆందోళన రేకెత్తిస్తోంది. నిరుడు మేలో.. టోర్నీ మధ్యలో ఒక కేసుతో మొదలై క్రమంగా పాజిటివ్‌లు పెరగడంతో లీగ్‌ను అర్ధంతరంగా వాయిదా వేసి నాలుగు నెలల తర్వాత యూఏఈలో పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

                       

About Author