PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌రోన కొత్త వేరియంట్.. యువ‌త‌కే ఎక్కువ సోకుతుందా ?

1 min read

పల్లెవెలుగు వెబ్​: ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ 20 దేశాల‌కు పాకిన‌ట్టు తెలుస్తోంది. ఈ వైర‌స్ పై ప‌రిశోధ‌న‌లు చేసిన శాస్త్రవేత్తలు.. దీని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు. ఒమిక్రాన్ తీవ్రత‌పై స్పష్టత ఇవ్వలేమ‌ని ద‌క్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వైర‌స్ యువ‌త‌కు ఎక్కువ‌గా సోకుతోంద‌ని, వ్యాధి నిరోధ‌క శ‌క్తి అధికంగా ఉండ‌టంతో తీవ్రత తెలియ‌డంలేద‌న్నారు. ఇప్పుడు ఈ వైర‌స్ పెద్దవారికి కూడ సోకుతోంద‌ని, అయితే వారిలో తీవ్రమైన స‌మ‌స్యలు కొన్నివారాల వ‌ర‌కు క‌నిపించ‌క‌పోవ‌చ్చన్నారు.

About Author