PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

150 మంది సుప్రీం కోర్టు సిబ్బందికి క‌రోన !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశ స‌ర్వోన్న‌త న్యాయస్థానం సుప్రీం కోర్టులో క‌రోన క‌ల‌వ‌రపెడుతోంది. దాదాపు 150 మంది సిబ్బంది క‌రోన బారినప‌డిన‌ట్టు తెలుస్తోంది. న్యాయ‌స్థానంలో మొత్తం 3 వేల మంది సిబ్బంది ఉండ‌గా.. వారిలో 150 మందికి క‌రోన నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలుస్తోంది. వైర‌స్ వ్యాప్తి పెరిగిన నేప‌థ్యంలో న్యాయ‌స్థానం ప్రాంగ‌ణంలోనే ప‌రీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసిన‌ట్టు న్యాయ‌స్థాన అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆదేశించారు.

                                       

About Author