PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేసీఆర్ కు క‌రోన.. ఫాంహౌస్ లో చికిత్స

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్:తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు క‌రోన సోకింది. వైద్య ప‌రీక్షల్లో పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. కొన్ని రోజులుగా క‌రోన ల‌క్షణాల‌తో బాధ‌ప‌డుతుండ‌టంతో ఆయ‌న వైద్య ప‌రీక్షలు చేయించుకున్నారు. వైద్య ప‌రీక్షల అనంత‌రం కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయ‌న క్వారంటైన్ లోకి వెళ్లారు. వైద్యులు సూచ‌న మేర‌కు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫాంహౌస్ లో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.

About Author