PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్వీ కుంభకోణం.. సీఎండీ, సీఎఫ్​వోలే కుట్రదారులు !

1 min read

పల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ కు చెందిన ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కుంభకోణంలో కీలక సూత్రధారులు ఆ సంస్థ సీఎండీ, సీఎఫ్వోలేనని ఈడీ నిర్దారణకు వచ్చింది. సంస్థలో కుంభకోణం సీఎండీ కొమండూరు పార్థసారథితో పాటు సీఎఫ్​వో కృష్ణహరి ఆదేశాలతో జరిగినట్టు వెల్లడైంది. షేర్ హోల్డర్లకు తెలియకుండా వారి షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందడం, డొల్ల కంపెనీల ద్వార ఆ నిధుల్ని మళ్లించడం అంతా వీరి కనుసన్నల్లో జరిగిందని ఈడీ నిర్ధారణకు వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ వీరిద్దరినీ తమ కస్టడీకి తీసుకుంది. ఈనెల 30 వరకు వీరిని విచారించనున్నారు. ఈడీ సేకరించిన సమాచారం ప్రకారం తమ ఖాతాదారుల షేర్లకు సంబంధించిన రూ.2,873 కోట్లు అక్రమంగా మళ్లించారు.

         

About Author