PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ను నిల‌దీసిన కౌన్సిల‌ర్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌త్య‌సాయి జిల్లా హిందూపురం మున్సిప‌ల్ స‌మావేశంలో ర‌సాభాస జ‌రిగింది. హిందూపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకుని వెళ్లాలంటూ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ను వైసీపీ మహిళా కౌన్సిలర్లు నిలదీశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా.. హిందూపురం మున్సిపాలిటీ ప్రాంతంలో డ్రైనేజ్, లైటింగ్, రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారపార్టీ మహిళా కౌన్సిలర్లు సమస్యలు లేవనెత్తారు. హిందూపురంలో ఏ ప్రభుత్వం వచ్చినా పీఏల రాజ్యం సాగుతోందని మహిళా కౌన్సిలర్ ఆరోపించారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎంపీ.. మహిళా కౌన్సిలర్ మాట్లాడుతున్న మైక్ కట్ చేయించారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు కౌన్సిలర్, కమిషనర్ ఎందుకంటూ వైసీపీ మహిళా కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                             

About Author