PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్న హుండీల లెక్కింపు

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు హుండీ ద్వారా దేవస్థానానికి రూ.1,81,36,794/-లు నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 17 రోజులలో సమర్పించడం జరిగింది. అలాగే ఈ హుండీల లెక్కింపులో 103 గ్రాముల బంగారం మరియు 1 కేజీ 800 గ్రాముల లభించాయి. వెండి అదేవిధంగా 139 యు.ఎస్.ఏ డాలర్లు, 15 యు.ఎ.ఈ. ధీర్ఘమ్స్, 10 ఇంగ్లాండ్ పౌండ్స్, 13 కత్తార్ రియాల్స్, 2 సింగపూర్ డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మరియు శివసేవకులు ఈ హుండీలెక్కింపులో పాల్గొన్నారు.

About Author