PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్న హుండీల లెక్కింపు

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం :  ఉభయ దేవాలయ హుండీ లెక్కింపుల లో భాగంగా దేవస్థానానికి రూ. 2,80,75,669 /- నగదు రాబడిగా లభించింది. ఆలయ హుండీల ద్వారా మల్లన్నకు భక్తులు 26 రోజులలో సమర్పించడం జరిగింది. అలాగే ఈ హుండీలో 177 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3 కేజీల 590 గ్రాముల వెండిలభించాయి. వివిధ దేశాల కరెన్సీ లభించాయి యుఎస్ఏ డాలర్లు – 769, మలేషియా రింగిట్స్ – 3, యూరోపియన్ -70, సింగపూర్ డాలర్లు – 10, యూ.ఏ. ఈ దిర్హమ్స్ – 25, కెనెడా డాలర్లు- 80, కరెన్సీ లెక్కింపులో లభించాయి. లెక్కింపులో భాగంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఈవో లవన్న మరియు అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author