NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓట్ల లెక్కింపు.. 2 చోట్ల చెద‌లు ప‌ట్టాయి.. 4 చోట్ల త‌డిసిపోయాయి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. 515 జ‌డ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాల‌కు లెక్కింపు జ‌రుగుతోంది. ప‌లు కార‌ణాల వ‌ల్ల 6 చోట్ల బ్యాలెట్ పేప‌ర్లు దెబ్బతిన్నాయ‌ని ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యద‌ర్శి గోపాల‌కృష్ణ ద్వివేది అన్నారు. రెండు చోట్ల బ్యాలెట్ పేప‌ర్లకు చెద‌లు ప‌ట్టగా.. నాలుగు చోట్ల త‌డిసిపోయాయ‌ని తెలిపారు. బ్యాలెట్ పేప‌ర్ల వ్యాలిడేష‌న్ పై క‌లెక్టర్లు, రిట‌ర్నింగ్ అధికారుల‌దే తుదినిర్ణయ‌మ‌ని చెప్పారు. రీ పోలింగ్ అవ‌స‌రం అనుకుంటే ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుంద‌ని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.

About Author