PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం రెడ్డి సత్రంలో దంపతుల ఆత్మహత్య

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం : శ్రీశైలంలోని రెడ్డి సత్రంలో గురువారం దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా ఇసుకపాలెంకు చెందిన బత్తుల వెంకట కాళేశ్వరరావు, బత్తుల నాగలక్ష్మి అనే దంపతులు బుధవారం ఉదయం రెడ్డిసత్రంలోని రూమ్​నం.12లో విడిది తీసుకున్నారు. గురువారం ఉదయం గది ఖాళీ చేయాలని సత్రం సిబ్బంది చెప్పేందుకు వెళ్లగా అప్పటికే దంపతులిద్దరూ మృత్యవుతో పోరాడుతున్నారు.

గమనించిన సిబ్బంది వెంటనే వైద్యచికిత్స కోసం సుండిపెంట ప్రభుత్వ వైద్యశాలకు 108 వాహనంలో తరలించారు. ఆస్పత్రికి వెళ్లేలోపు నాగలక్ష్మి మృతి చెందగా… కొంత సేపటికి బత్తుల వెంకట కాళేశ్వరరావు కూడా మృతి చెందాడు. శ్రీశైలం వన్​టౌన్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Author