PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెలుగోడులో జంట హత్య

1 min read

– కోడలు, మరో వ్యక్తిని హత్య చేసిన మామ
పల్లెవెలుగు వెబ్​, వెలుగోడు : అక్రమ సంబంధం ఉందనే కారణంతో మామ తన కోడలు, మరో వ్యక్తిని దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. కర్నూలు జిల్లా వెలుగోడు పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఆ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెలుగోడు సీఐ కృష్ణయ్య, ఎస్​ఐ పీరయ్య యాదవ్, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన పీట్ల మల్లికార్జునకు అదేగ్రామానికి చెందిన పీట్ల రవణమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉంది. అదేవిధంగా వెలుగోడు పట్టణం సీపీ నగర్​కు చెందిన పీట్ల చిన్ని (24) అనే మహిళను మల్లికార్జున రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక మగ సంతానం. శుక్రవారం సొంత పనుల నిమిత్తం మల్లికార్జున సిద్దాపురం గ్రామానికి వెళ్లాడు. సిపీ నగర్ ప్రాంతానికి చెందిన చందా ఓబులేసు గత కొంత కాలంగా తాపీ పని చేస్తూ.. ఇక్కడే నివాసం ఉంటున్నాడు.

పీట్ల మల్లికార్జున తండ్రి పీట్ల రమణయ్య తన రెండవ కోడలు పీట్ల చిన్ని మరియు చంద్ర ఓబులేసుతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఇద్దరిని గొడ్డిలితో నరికి హతమార్చాడు. వెంటనే పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు. ఘటనా స్థలిని సీఐ బీఆర్ కృష్ణయయ, వెలుగోడు ఎస్​ఐ చిన్న పీరయ్య యాదవ్​ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Author