PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలులో దంప‌తుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలో దంప‌తులు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామానికి చెందిన గోకారమ్మ (19) భర్తతోపాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గోకార‌మ్మ చికిత్స పొందుతూ మృతిచెందింది. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన గోకారమ్మ, భాస్కరాపురం గ్రామానికి చెందిన స్వాములు మూడు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులు వారిని ఇండ్లలోకి రానీయకపోవడంతో వేరే కాపురం పెట్టారు. ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడటం లేదని మనస్తాపానికి గురై ఈనెల 26న ఇద్దరూ ఇంట్లో విష ద్రావణం తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. స్థానికులు వారిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

                                           

About Author