NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్టీలో కోవ‌ర్టులు : చంద్రబాబు

1 min read

పల్లెవెలుగు వెబ్​: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో కోవ‌ర్టులు ఉన్నార‌ని అన్నారు. పార్టీలోని కోవ‌ర్టుల‌ను ఏరిపారేస్తామ‌ని, కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళ‌న జ‌రుగుతుంద‌ని తెలిపారు. కుప్పం తెలుగు దేశం పార్టీ రివ్యూ మీటింగ్ లో ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజ‌ల్లో ప‌నిచేసిన వారికే గుర్తింపు ఉంటుంద‌ని చెప్పారు. స్థానిక నేత‌ల అతివిశ్వాసం వ‌ల్లే పార్టీ ఓడిపోయింద‌ని అన్నారు. కుప్పం స్థానిక నాయ‌క‌త్వంలో మార్పులు చేయాలన్న కార్యక‌ర్తల సూచ‌న‌లు అమ‌ల్లోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక‌పై త‌రుచూ కుప్పంలో ప‌ర్యటిస్తానని తెలిపారు. కుప్పంలో సొంత ఇళ్లు నిర్మిస్తామని, ఎక్కువ సమయం కేటాయిస్తానని చంద్రబాబు తెలిపారు.

About Author