PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీపీఐ నారాయ‌ణ స‌తీమ‌ణి క‌న్నుమూత

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీపీఐ సీనియర్‌ నేత నారాయణ భార్య వసుమతి కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు నగరి నియోజకవర్గం ఐనంబాకం గ్రామంలో వసుమతి అంత్యక్రియలు జరుగుతాయని చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శి రామానాయుడు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సతీమణి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

                                                    

About Author