PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా.. సీపీఎస్​ రద్దు చేయాల్సిందే..

1 min read

– హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ చంద్రశేఖర్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్​ రద్దు చేస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చిన వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి … అధికారంలోకి వచ్చి 120 వారాలు అయినా రద్దు చేయకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ చంద్రశేఖర్​. సీపీఎస్​ రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ.. బుధవారం కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్​లో APCPSEA ఆధ్వర్యంలో పెన్షన్​ విద్రోహ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్​ మాట్లాడుతూ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవా లన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం (5వ తేదీ) కానుకగా సీపీఎస్​ రద్దు చేయాలని కోరారు. అప్పుడు ఉద్యోగులు పెన్షన్​ విద్రోహ సభ బదులు… పెన్షన్​ పండగ సభ నిర్వహిస్తామన్నారు. సీపీఎస్​ రద్దు అయ్యేంత వరకు APCPSEA నేతృత్వంలో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టైగర్ కేశవ, జిల్లా ప్రధాన కార్యదర్శి దిన్నె విశ్వేశ్వప్ప, కార్యదర్శులు శ్రీనివాస రెడ్డి, నాగశేషులు, నాగునాయక్, గారు పాల్గొన్నారు.

About Author