PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ద్వేష‌పూరిత వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ్ఞాన్‌వాపి, మధుర వంటి విషయాల్లో సంఘ్‌ పరివార్‌ ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. సంఘ్‌ పరివార్‌ దేశాన్ని చీకటి దశలోకి నెట్టాలనుకుంటోందని ఘాటుగా విమర్శించారు. జ్ఞాన్‌వాపీ మసీదు వ్యవహారాన్ని వివాదంలోకి లాగడంతో బాబ్రీ మసీదు వంటి ఘటన పునరావృతమవుతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ముస్లిం మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. జిల్లా కోర్టు జ్ఞాన్‌వాపి మసీదుకు న్యాయం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

                                       

About Author