PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ్యాంగ సృష్టికర్త..బాటలో పయనిద్దాం..

1 min read

టీడీపీ రాజంపేట సీనియర్ నేత ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ రాజు

భారతరత్న డా.బి.ఆర్​. అంబేద్కర్​కు ఘననివాళి

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా:ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాటలో నడవాలని టిడిపి రాజంపేట సీనియర్ నేత, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ రాజు పిలుపునిచ్చారు. వీరబల్లి మండల కేంద్రంలో శుక్రవారం దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు జగన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగన్ రాజు రాక సంధర్భంగా దళిత సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. జూనియర్ కళాశాల వద్ద నుండి ర్యాలీ గా అంబేద్కర్ సర్కిల్ వద్ద కు చేరుకొని దళిత సంఘాల నాయకులు, టిడిపి నాయకులుతో కలిసి జగన్ రాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన కూడా స్వయంగా  అందరితో కలిసి అక్కడ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు భానుగోపాల్ రాజు, మండల సీనియర్ నాయకులు రెడ్డెప్ప రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్రామ రాజు, జయచంద్రా రెడ్డి, ఆంజనేయులు రెడ్డి, సిధ్ధిరాజు, వీఆర్డీఎస్ ఛైర్మెన్ సురేంద్ర రెడ్డి, తుమ్మల రమేష్, దళిత, ప్రజా సంఘాల నాయకులు వెంకట్, సొరువు రాము, భాస్కర్, నర్సింహులు, రామాంజులు, సాయి, టిడిపి నాయకులు నేతి రమేష్ బాబు, భాస్కర్ రాజు, ప్రభాకర్ నాయుడు, నాగప్పనాయుడు, వీరామృత నాయుడు, దుర్గం ఆంజనేయులు, సుధాకర్, సీతారామరాజు, కొత్తపల్లె ఆంజనేయులు, సీతారామిరెడ్డి, బీసీ నాయకులు వెంకటేశ్, రామక్రిష్ణ, సుబ్బరామ, ఐటిడిపి పవన్, వినయ్, గిరి, మహేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

About Author