PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో క్రికెట్ పోటీలు ప్రారంభం

1 min read

-పోటీలను ప్రారంభించిన జడ్పీటీసీ,ఎస్సై

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాల సందర్భంగా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి.మంగళవారం ఉదయం జిల్లా పరిషత్ ప్రాంగణంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించడానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మండల జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి మరియు ఎస్సై మారుతి శంకర్ రిబ్బన్ కట్ చేసి పోటీలను వారు ప్రారంభించారు.మొత్తం 33 జట్లు ఈక్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటూ ఉన్నాయని వైసీపీ మండల కన్వీనర్ మరియు మిడుతూరు ఉపసర్పంచ్ తువ్వా లోకేశ్వర రెడ్డి తెలిపారు.ఆటల పోటీలలో ప్రతి ఒక్కరూ ప్రతిభ కనబరచాలని అప్పుడే గుర్తింపు అనేది వస్తుందని ముఖ్య అతిథులు క్రీడాకారులకు తెలియజేశారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ ఎలాంటి గొడవలకు చోటు లేకుండా మంచిగా ఆడే విధంగా ఉండాలని వారు అన్నారు.ఈకార్యక్రమంలో తువ్వా రామ నాగేశ్వర రెడ్డి,చింతలపల్లె మల్లేశ్వర రెడ్డి,వీపనగండ్ల రాజేశయ్య, హనుమంతు,ఆర్గనైజర్లు చక్రి,అశోక్,శ్రీకాంత్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

About Author