PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

42 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : న‌రేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక తొలి మంత్రి వ‌ర్గ విస్తర‌ణ చేప‌ట్టారు. ఈ మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌లో 36 మందికి చోటుద‌క్కింది. దీంతో మొత్తం కేంద్రమంత్రుల సంఖ్య 78కి చేరింది. తొలి మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో చోటుద‌క్కించుకున్న 36 మందిలో .. 33 మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్రటిక్ రిఫామ్స్ సంస్థ వెల్లడించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌మ‌ర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ నివేదిక రూపొందించింది. 2019లో తొలి మంత్రివ‌ర్గంలో 56 మంది మంత్రులు ఉండ‌గా.. వారిలో 39 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సంఖ్య పెరిగింది.

About Author