NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంట నష్టం అంచనా నివేదిక.. సిద్ధం..!

1 min read
(ఫైల్)

పల్లెవెలుగు వెబ్​, మహానంది: గత అక్టోబరులో కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి మహానంది మండలం లోని కొన్ని గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు పరిహారం అందజేయాలని.. అప్పట్లో పల్లెవెలుగు దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. వార్తకు స్పందించిన వ్యవసాయ అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.  దాదాపు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు  వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి పరిశీలనలో తేలింది. పంట నష్టపరిహారం కోసం …  పంట నష్టం అంచనాను తయారు చేసిన  ఏఓ సుబ్బారెడ్డి జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను అందజేయనున్నారు.

About Author