PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ సభలలో పంట నమోదు

1 min read

పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని చెరుకుచెర్ల,తిమ్మాపురం గ్రామాలలో వ్యవసాయ సహాయ సంచాలకులు పి.విజయ శేఖర్ మరియు మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు.ఈ గ్రామ సభలో పంట నమోదులో ఏమైనా తప్పులు మరియు పంట నమోదు యొక్క విశిష్టత వాటిలో గల సందేహాలపై రైతులతో చర్చించడం జరిగింది.అదేవిధంగా ప్రతి రైతుభరోసా కేంద్రాలలో పంట నమోదు వివరాలు ఆరైతు భరోసా కేంద్రాలలో ఉన్న అధికారులు రైతులకి అందుబాటులో వారు చూసుకునే విదంగా ఉండాలని సిబ్బందికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చెరుకుచెర్ల సర్పంచ్ సోగరాజు మరియమ్మ,ఉప సర్పంచ్ నారాయణరెడ్డి, వ్యవసాయ సహాయకులు మద్దిలేటి,వెంకటేశ్వర్లు ఎంపీఈఓ మౌలాలమ్మ మరియు రైతులు పాల్గొన్నారు.

About Author