PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోటి 20 లక్షల రూ. జడ్పీ నిధులతో సిసి రోడ్లు పనులు ప్రారంభం..

1 min read

– నిర్మాణంలో నాణ్యత పరిణామాలు పాటించాలి..

– ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  దెందులూరు ఎమ్మెల్యే  కొఠారు అబ్బయ్య చౌదరి,  జెడ్పీ చైర్మన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్ తో కలిసి దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని కళింగపేటలో 1 కోటి 20 లక్షల రూపాయల జెడ్పీ నిధులతో వేయనున్న నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే  జరుగుతున్న పనులను పరిశీలించి, రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నిర్ణీత గడువులోగా పనులను పూర్తీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author