PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడి..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండల కేంద్రంలోని (గడిగరెవుల) గ్రామం వద్ద వెలసిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం నాడు భక్తులు కిటకిట లాడారు ఆలయవరణంలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు ధూప దీప నైవేద్యాలతో మహాన్యాస రుద్రాక్ష పూజలు ఈశ్వరునికి నిర్వహించారు వచ్చిన భక్తులు స్వామివారికి క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణం నిర్వహించారు  ఆలయ అర్చకులు శ్యాంసుందర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది దాతల సహకారంతో వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆర్యవైశ్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

About Author