PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా గడివేముల మండలంలోని శివాలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది. ఓం నమశ్శివాయ మంత్రంతో ఆలయాలు మారుమోగాయి.. గడిగరేవుల వద్ద వెలసిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానంలో భారీ సంఖ్యలో భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు  కోనేటిలో స్నానమాచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చన నిర్వహించారు ఆలయ ఆవరణలో మహిళా భక్తులు కార్తీకదీపం వెలిగించారు.. వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు… పై భోగుల గ్రామం  వద్ద ఏడూర్ల గవిలో వెలిసిన గంగ సహిత ఉమామహేశ్వర స్వామి కి భక్తులు ప్రత్యేక పంచామృత అభిషేకం పుష్పార్చన నిర్వహించారు ఉదయం 7:30 నుండి సాయంత్రం 4 వరకు దాదాపు 2000 మంది భక్తులు స్వామివారిని వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు పరమటూరు రేగౌట శ్రీదేవి గని ప్రతాప్ రెడ్డి . పైబోగుల రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఋషికేష్ కాశీనాథ్ స్వామి ఆధ్వర్యంలో పూజాదికాలు నిర్వహించారు.

About Author