PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్టీసీ బ‌స్సుకు క‌రెంట్ షాక్..

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆర్టీసీ బ‌స్సుకు క‌రెంట్ షాక్ త‌గిలింది. క‌ల్వకుర్తిలో ఓ బ‌స్సుకు ప్రమాద‌వ‌శాత్తు క‌రెంట్ వైర్లు త‌గిలాయి. దీంతో బ‌స్సులోని ఓ మ‌హిళ మృతి చెందింది. మ‌రో ఇద్దరి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. క‌ల్వకుర్తి నుంచి అచ్చంపేట వెళ్లే దారిలో ఆర్టీసీ బ‌స్సుకు విద్యుత్ వైర్లు త‌గిలాయి. దీంతో బ‌స్సులో ప్రయాణిస్తున్న న‌ర్సమ్మ అనే మ‌హిళ అక్కడికక్కడే మ‌ర‌ణించింది. డ్రైవ‌ర్ నిర్లక్ష్యం కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ వైర్లు కింద ప‌డి ఉండ‌టాన్ని గ‌మ‌నించ‌క‌పోవ‌డంతో ప్రమాదం సంభ‌వించిన‌ట్టు ప్రయాణీకులు చెబుతున్నారు.

About Author