PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి ఎమ్మెల్సీల గెలుపుని చూసి ఓర్వలేక దళిత ఎమ్మెల్యేపై దాడి

1 min read

– తెలుగు దేశం పార్టీ యువ నాయకులు యమల మణికంఠ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: రాష్ట్ర అసెంబ్లీలో తెదేపా దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి గారి మీద వైసిపి రౌడీ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యామల మణికంఠ మాట్లాడుతూమనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా లేక రాక్షస రాజ్యం లో ఉన్నామా అనే అనుమానం వస్తుంది,అసెంబ్లీలో టిడిపి దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి గారి పై వైసీపీ ఎమ్మెల్యేల దాడిని ఖండిస్తున్న, టిడిపి ఎమ్మెల్సీల గెలుపుని చూసి ఓర్వలేక వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా టిడిపి ఎమ్మెల్యేల పై దాడి చేశారు. ఈ రాక్షస పాలకులకు ప్రజలు తొందరలోనే తగిన బుద్ధి చెప్తారన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే జీఓ 1 రద్దు చేయాలని డిమాండ్ చెయ్యడం కూడా జగన్ పాలన లో నేరమేనా,ఉన్నత విలువలతో సుధీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న దళిత ఎమ్మెల్యే స్వామి గారు, సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి మీద దాడి చెయ్యడం దుర్మార్గం,అసెంబ్లీ లో జరిగిన ఘటనని ప్రజాస్వామ్యవాదులు అందరూ తీవ్రంగా ఖండించాలని ఆయన అన్నారు .

About Author