PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు

1 min read

ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ లకు 54 ఇళ్ల స్థలాలు సీఎం కేటాయించడం హర్షనీయం..

దళిత జేఏసీ నేషనల్ చైర్మన్.. పెరికే వరప్రసాదరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మాయ మాటలు ఎవరు నమ్మరు చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా అన్ని అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు నాయుడు మాయలో ఎవరు పడద్దని వైఎస్సార్సీపీ నాయకులు మరియు దళిత జేఏసీ నేషనల్ చైర్మన్ పెరి కె వరప్రసాదరావు పిలుపునిచ్చారు.  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాద్యాన్ని ప్రవేశపెడితే కోర్టులో ఫిల్ చేయించి అడ్డుకున్న వ్యక్తి నారా చంద్రబాబునాయుడు అని. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో ఎస్సీ , ఎస్టీ , బీసీ, మైనార్టీలు కు 54 వేల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులో ఫీల్డ్ వేయించి అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అయినప్పటికీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కోర్టులను అధిగమించి ఇంగ్లీష్ మీడియాను సాధించారని అదేవిధంగా 54 ఇళ్ల స్థలాలను విజయవంతంగా రేపు 18 వ తారీఖున ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి  వైస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సిపిఐ సిపిఎం ఎన్ని జిమ్మికల్ చేసిన ఎన్ని మాయమాటలు చెప్పిన 20 24 లో మళ్లీ సీఎం గా  వైయస్ జగన్మోహన్ రెడ్డి గారే అని తెలిపారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తే తెలుగుదేశం అధికారులకు వస్తే రద్దు చేస్తాం అనటం దళిత వ్యతిరేక చర్యలు అని తీవ్రంగా ఖండించారు దీనికి తోడు ఎల్లో మీడియా దుష్ట చతిష్టయం కలిపి జగన్ ని పై నీచమైన స్టోరీలు రాస్తున్నాయని ప్రజలు ఎల్లో మీడియాని ఎవరు చూడలేదని ఎల్లో మీడియాని ప్రజలు బ్యాన్ చేశారని తెలిపారు. ఏ సర్వే చెప్పిన చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని తెలుసుకొని అబద్దాబద్రత గురవుతున్నారని చంద్రబాబు నాయుడు పల్లకి మోయటానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని రైతుల ముసుగులో రాజకీయం పాపం కడుపుకుంటున్న చంద్రబాబు నాయుడు తుఫాన్లు వర్షాలు అన్ని ప్రాంతాల్లో పడుతున్నాయని ఎక్కడలేని విధంగా  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  రైతులకు నష్ట పరిహారం అందిస్తున్నారని అయినా చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా పనుగట్టుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ని విషం చిమటం ధ్యేయంగా పెట్టుకున్నాయని. ప్రజా కోర్టులో తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్. ఎల్లో మీడియా కొట్టుకుపోతారని హితవు పలికారు. వైసీపీ నాయకులు దళిత జేఏసీ నేషనల్ చైర్మన్ పెరుకె వరప్రసాదరావు తెలిపారు.

About Author