NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద‌మ్ముంటే.. నా ఛాతీ పై తుపాకీ గురిపెట్టు !

1 min read

పల్లెవెలుగువెబ్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కలవనివ్వబోనని తేల్చి చెప్పారు. ‘‘నా శరీరంలో రక్తం ఉన్నంత వరకు బెంగాల్ విభజనను అనుమతించను’’ అని స్పష్టం చేశారు. బెంగాల్ విభజన కోసం డిమాండ్ చేస్తున్న కమ్టాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ చీఫ్ జిబోన్ సింగ్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన ఛాతీపైకి తుపాకీ గురి పెట్టాలన్నారు. అలీపుర్‌ద్వార్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

                                            

About Author