PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డేంజ‌ర్ లో `డ్యాం`లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను కృష్ణా నదీ యాజమాన్య సంస్థ హెచ్చరించింది. తక్షణమే వీటికి మరమ్మతులు చేయకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. ఈ నెల 6వ తేదీన జరిగిన 16వ సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలను బోర్డు విడుదల చేసింది. ఈ మూడు రిజర్వాయర్లలో నిర్వహణ లోపాలు భారీగా ఉన్నాయని తెలిపింది. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా..ముందుచూపు లేకుండా ఇబ్బడిముబ్బడిగా జల విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు పడిపోయి.. తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

                             

About Author