NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పొంచిఉన్న ప్రమాదం…పట్టించుకోండి

1 min read

పల్లెవెలుగు, వెబ్ వెలుగోడు: పట్టణంలోని సి.పి.నగర్ లో కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభం వర్షాలకు వంగింది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ విషయమై విద్యుత్ ఏ.ఇ రవీంద్ర నాయక్ కు తెలపడం జరిగింది. ఆ ఏరియా లైన్ మెన్ కు తెలియ జెసి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. కానీ ఎలాంటి స్పందన లేదు. అంటే ప్రమాదం జరిగిన తర్వాత కానీ స్పందించరా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికయినా అధికారులు తగిన చర్యలు తీసుకుని, సమస్య ను పరిష్కరించాలని కోరుతున్నారు.

About Author