NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుటుంబీకులతో… ప్రాణహాని..

1 min read

రక్షణ కల్పించండి..

  • ఎస్పీని కోరిన యువతి

కర్నూలు, పల్లెవెలుగు:తాము ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ వివాహం చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట కర్నూలు ఎస్పీని ఆశ్రయించింది.  మామిదాలపాడుకు చెందిన సుమన్​, పొలకల్​ కు చెందిన భారతి సోమవారం హైదరాబాద్​ లోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.  ఒకే సామాజిక వర్గానికి చెందిన తాము బి.టెక్​ చదవామని, తమ పెళ్లికి పెద్దల అంగీకారం లేకపోవడంతో రక్షణ కల్పించాలని ప్రేమ జంట ఎస్పీని  ఆశ్రయించారు.  సోమవారం సాయంత్రం డీఎస్పీ బాబు ప్రసాద్​ నేతృత్వంలో కౌన్సిలింగ్​ ఇచ్చి…ఆ తరువాత తాలూకా పోలీస్​ స్టేషన్​ కు కేసు ను రెఫర్​ చేస్తూ… సీఐకి ప్రేమ జంటను  అప్పగించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *