PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దత్తదేవుడి ఆశీస్సులు… వైఎస్​ భారతి రెడ్డి పై ఉండాలి

1 min read

వైసీపీ కర్నూలు నగర నాయకులు రాజా విష్ణువర్ధన్​ రెడ్డి

  • వైఎస్​ భారతమ్మ జన్మదినం సందర్భంగా సాయిబాబా మాలాధారులకు అల్పాహారం,భిక్ష ఏర్పాటు

పల్లెవెలుగు:దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు… వైఎస్​ భారతి రెడ్డిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు వైసీపీ కర్నూలు నగర నాయకులు రాజా విష్ణువర్ధన్​ రెడ్డి, బీసీ సెల్​ కర్నూలు జిల్లా ఇన్​చార్జ్​ నాగరాజు యాదవ్​. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి సతీమణి వైఎస్​ భారతి రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం గంగాపూర్​లోని శ్రీ దత్త పీఠం నందు సాయిబాబా మాలధారులకు అల్పాహారం, మధ్యాహ్నం (భిక్ష) అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజా విష్ణువర్ధన్​ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన దత్తపీఠంలో సాయిబాబా మాలధారులకు అల్పాహారం, భిక్ష ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి సతీమణి వైఎస్​ భారతి రెడ్డిపై శ్రీ దత్తాత్రేయ స్వామి, సాయిబాబా ఆశీస్సులు ఉండాలని, ఆమె నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం వైసీపీ బీసీ సెల్​ కర్నూలు జిల్లా ఇన్​చార్జ్​ నాగరాజు యాదవ్​ మాట్లాడుతూ వైఎస్​ భారతమ్మ జన్మదినం సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశామన్నారు.  అలాగే సాయిబాబా మాలదారులకు అల్పాహారం,భిక్ష ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ప్రసాద్​ యాదవ్​, శేఖర్​, రాము, సతీష్​ తదితరులు పాల్గొన్నారు.

About Author