PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవత్వంతో.. వ్యవహరించండి..

1 min read

– నిర్ణీత ధరలకే.. మృతదేహాలను తరలించాలి
– అంబులెన్స్​ డ్రైవర్లు, యజమానులకు సూచించిన ఎస్పీ అన్బురాజన్​
పల్లెవెలుగు వెబ్​, కడప: కరోన కష్టకాలంలో ప్రైవేట్​ అంబులెన్స్​ డ్రైవర్లు, యజమానులు మానవత్వంతో వ్యవహరించాలని కడప ఎస్పీ అన్బురాజన్​ సూచించారు. శనివారం కోడూరు సీఐ విశ్వనాథ రెడ్డి, ఎస్​ఐ ఓబన్న ఆధ్వర్యంలో ప్రైవేట్​ అంబులెన్స్​ డ్రైవర్లు, యజమానులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, బెంగుళూరు, హైదరాబాద్, తిరుపతికి వెళ్లే అంబులెన్స్​ డ్రైవర్లు నిర్ణీత ధరలకే మృతదేహాలను, కోవిడ్​ బాధితులను తరలించాలని ఆదేశించారు. అధిక ధరలకు వసూలు చేయాలని చూస్తే… 100కు ఫోన్​ చేయాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా నిర్ణీత ధరలకే ఫీజు తీసుకుంటామని అంబులెన్స్​ డైవర్లు, యజమానులు ఎస్పీ అన్బురాజన్​కు ఎదుట స్పష్టం చేశారు. సమావేశంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

About Author