PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పితరులకు ప్రియం.. మహాలయం..

1 min read

– 21 నుంచి వచ్చే 6 వరకు మహాలయ పక్షాలు
– కళ్లే. ప్రతాప్ శర్మ, కృష్ణ యజుర్వేందం, తిరుమల తిరుపతి వేదపండింతులు
పల్లెవెలుగు వెబ్​: భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదం, కృష్ణపక్షం పితృపదము.. దాన్నే మహాలయ పక్షం అంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 21 నుంచి భాద్రపద పాడ్యమి నుంచి అక్టోబరు 6వ తేదీ అమావాస్య వరకు మహాలయ పక్షము అంటారు . ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు. ఈ 15రోజులు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం శ్రాద్ధవిధులను నిర్వహించాలి అలాకుదరని పక్షమున పితృదేవతలు ఏతిధిలో మరణిస్తే ఆరోజు నిర్వహించాలి .
మహాలయ: మహాన్ – అత్యంతికోలయో యత్ర-మహాలయః ఆ సమంతా త్లయం ఆలయం అని మహాలయాన్ని గురించి రెండు వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయి. మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా ప్రళయం సంభవించి న రోజు. మరో అర్థం లో ప్రళయ కాలం వరకు నిలిచి వుండి అప్పుడు లభ్యమయ్యేవి.
మహాలయమంటే : మహాన్ అలయః, మహాన్‌లయః. మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము,
పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట, అని అర్థములు.
పితృగణాలు మొత్తం ఏడుగురు.

  1. వైరాజులు 2. అగ్ని ష్పావత్తులు 3.బర్విషదులు 4. హవిష్మంతులు 5. ఆజ్యపులు 6. సోమపులు 7. అంగిరసులు.
    మహాలయ శ్రాద్ధం లో వచ్ఛే విశ్వే దేవతలకు “ధురి విలోచనులు” అని పేరు.
    మన భౌతిక శరీరం మొదటి ది – కనిపిస్తుంది. రెండవది- ప్రేత శరీరము, మూడవది-ఆత్మ సూక్ష్మ శరీరం.
    వీటి ప్రతీకలు వసు (3), రుద్ర(11), ఆదిత్య(12) రూపాలు.
    ఈ మూడు రూపాల్లో నుంచి పితృ లకు 1. అగ్ని ముఖం గా 2.బ్రాహ్మ ణ భోజనంగా 3. పిండి ప్రదానం గా 4.ఉపవాసంగా శ్రాద్ధం ఏ ర్పాటు చేసుకో వచ్చు.
    తండ్రి మరణించిన వారే మహా లయపక్షం చేయడానికి అర్హులు.
    మహాలయం…. లో కొన్ని ప్రత్యేకం గా సూచించారు. అవి
    ☀సన్యాసులకు … ద్వాదశినాడు☀
    💥బలవన్మరణం(suicide), విషప్రయోగం లతో మరణించిన వారికి…. చతుర్దశి నాడు
    ☀భర్త జీవించి ఉండగా మరణించిన సువాసినీ. స్త్రీ … నవమి నాడు💥
    అయితే.. కూతురు తన కొడుకు చేత తన తల్లీ దండ్రులకు శ్రాద్ధం చేయదలచి నప్పుడు… ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేయాలి.
    💥తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి.
    💢తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన పూర్తి గా తప్పక పితృకర్మలు చేయాలి.
    ఇతర కారణముల వలన ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య అనగా 06/10/2021 బుధవారం అయినా చేసి తీరాలి.
    {ఈ పక్షములో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు.}
    తండ్రి చనిపోయిన రోజున(తిధి), మహాలయ పక్షములలో పితృతర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే, పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు. తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని పొందుతారు.
    ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు, ధర్మసింధూ,నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.

About Author