PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రియ‌మ‌ణి వివాహం చెల్లదు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ న‌టి ప్రియ‌మ‌ణి -ముస్తాఫా రాజ్ వివాహం చెల్లదంటూ ముస్తాఫరాజ్ మొద‌టి భార్య ఆయేషా ఆరోపించారు. త‌న‌కు విడాకులు ఇవ్వకుండా వారి వివాహం చ‌ట్టప‌రంగా చెల్లుబాటుకాద‌ని వ్యాఖ్యానించారు. ఈమేర‌కు ప్రియ‌మ‌ణి, ముస్తఫా రాజ్ ల‌పై ఆయేషా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ముస్తఫా త‌న‌ను శారీర‌కంగా ఇబ్బంది పెట్టాడంటూ కేసు పెట్టింది. చ‌ట్టప్రకారం ముస్తఫా ఇప్పటికీ త‌న భ‌ర్తే అని, ఇప్పటి వ‌ర‌కు తామిద్దరం విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌లేద‌ని చెప్పారు. ఎన్నో రోజుల నుంచి ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని అనుకుంటున్నాన‌ని, ఇద్దరు పిల్లల త‌ల్లికావ‌డంతో ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టలేకపోయాయ‌ని అన్నారు. ఇప్పుడు ప‌రిస్థితులు తారుమారు కావ‌డంతో .. ఈ నిర్ణయం తీసుకున్నాన‌ని ఆయేషా చెప్పారు. అయితే.. త‌న మొద‌టి భార్య ఆయేషా పెట్టిన కేసుపై ముస్తఫా స్పందిస్తూ 2017లో ప్రియ‌మ‌ణితో త‌న వివాహ‌మైందని, ఇప్పుడు కేసు పెట్టడం స‌రికాద‌న్నారు. ఆయేషా తో విడిపోయిన‌ప్పటి నుంచి పిల్లల‌కు అవ‌స‌ర‌మైన డ‌బ్బు పంపుతున్నాన‌ని తెలిపారు. ఆయేషా కావాల‌నే ఇదంతా చేస్తున్నార‌ని ఆరోపించారు.

About Author