PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ర‌ణ వార్త దాచి.. ఒలంపిక్స్ కు పంపి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : త‌మిళ‌నాడులోని తిరుచ్చి జిల్లా గుండూర్ కు చెందిన ధ‌న‌ల‌క్ష్మి శేక‌ర్ ఒలంపిక్స్ 4 X 400 మిక్స్డ్ డ‌బుల్ పోటీల్లో పాల్గొంది. టోక్యో ఒలంపిక్స్ వెళ్లేందుకు మిగిలిన బృంద స‌భ్యుల‌ను క‌లిసేందుకు ధ‌న‌ల‌క్ష్మి పంజాబ్ వెళ్లింది. ఆ స‌మ‌యంలోనే ఆమె అక్క మ‌ర‌ణించింది. అక్క మ‌ర‌ణ‌వార్త తెలిస్తే ఏకాగ్రత దెబ్బతింటుంద‌ని కుటుంబ స‌భ్యులు ఈ విష‌యాన్ని దాచారు. క్రీడ‌లు ముగించుకుని శ‌నివారం రాత్రి తిరుచ్చి విమానాశ్రయం చేరుకుంది. అక్క మ‌ర‌ణ‌వార్త తెలియ‌డంతో విమానాశ్రయంలోనే బోరున విల‌పించింది. బంధువులు, కుటుంబ స‌భ్యులు ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకెళ్లారు.

About Author