PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళ మృతి..నివాళులు అర్పించిన సుధీర్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామానికి చెందిన యాట రంగస్వామి భార్య కుమారి(45)మంగళవారం సాయంత్రం 4 గంటలకు మరణించారు.గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారని నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా అనారోగ్యం క్షీణించి  మరణించిందని వారు తెలిపారు.విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్ బుధవారం గ్రామానికి చేరుకొని ఆమె మృతదేహానికి పూల మాలలతో నివాళులు అర్పించారు.గ్రామ సర్పంచ్ టి.ఉషారాణి,సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,నందికొట్కూరు వైసీపీ నాయకులు జబ్బార్ పూల మాలలతో నివాళులు అర్పించారు.ఈమెకు ఇద్దరు కూతుర్లు శ్రీజ(15),తేజ(14)ఉన్నారు.ఈమె మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రులు శోకసంద్రంలో ఉన్నారు.కుటుంబానికి అండగా ఉంటామని డాక్టర్ దార సుధీర్  తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు టి.సర్వేశ్వర రెడ్డి,చిన్న పుల్లారెడ్డి,రాంభూపాల్ రెడ్డి,అబ్దుల్ కరీం,మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

About Author