PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాక్ జైళ్లలో భార‌త ఖైదీల మృత్యువాత‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో భారతీయులు పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్నారు. అయితే, ఇటీవలకాలంలో పాక్ జైళ్లలో భారత ఖైదీల మరణాల సంఖ్య పెరిగింది. ఈ పరిణామాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందించారు. భారత ఖైదీల భద్రత పట్ల పాకిస్థాన్ నిబద్ధతతో వ్యవహరించాలని కోరారు. గత 9 నెలల వ్యవధిలో ఆరుగురు భారత ఖైదీలు పాక్ జైళ్లలో మృత్యువాత పడ్డారని, వారిలో ఐదుగురు మత్స్యకారులని బాగ్చి వెల్లడించారు. వారు తమ శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ, పాకిస్థాన్ అధికారులు వారిని అక్రమంగా నిర్బంధంలో ఉంచారని, ఆ సమయంలోనే వారు చనిపోయారని ఆరోపించారు.

                                            

About Author