NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మృత్యుగీతలు . నిత్యం ప్రమాదాలమయం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : ఆ రహదారిపై ప్రయాణించాలంటే మండల వాసులకు ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలకు ఆహ్వానం పలికినట్టే గడివేముల నుండి నంద్యాలకు వెళ్లే రహదారి నిత్యం ద్విచక్ర వాహనాదారులకు ప్రమాదాలకు నిలయంగా మారింది ఈమధ్య నాలుగైదు రోడ్డు ప్రమాదాలు జరగడం గతంలో నిర్మించిన సిసి రహదారి నేర్రెలు విడిచి టైర్లు గుంతలో పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు తాజాగా శనివారం నాడు తిరుపాడు గ్రామానికి చెందిన మణి అనే మహిళ ఆటో అదుపుతప్పి కిందపడి మహిళకు చంటి పిల్లాడికి గాయాలయ్యాయి ప్రమాదాలకు గురవుతున్న కనీసం నేర్రెలకు మరమ్మత్తు చేసే నాథుడు లేడు జిందాల్ సిమెంట్ పరిశ్రమ కావడంతో వారి ఆధ్వర్యంలో నిర్మించిన రహదారి దాదాపుగా చిందుకూరు నుండి వెంకటేశ్వరపురం బాట వరకు రహదారి అంతా గుంతలమయంగా మారింది ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతు చేయాలని వాహన దారులు కోరుతున్నారు.

About Author