PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయచోటిని.. జిల్లా కేంద్రం గా ప్రకటించడం .. ప్రజా విజయం..

1 min read

మాజీ పిసిసి సభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయఛోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం ప్రజలు సాధించిన విజయమని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (రాముడు)పేర్కొన్నారు. బుధవారం రాయచోటి లోని స్థానిక మండిపల్లి భవన్ లో రాంప్రసాద్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం అయినటువంటి రాయచోటినీ జిల్లా కేంద్రంగా ప్రకటించడం హర్షించదగిన విషయం దీనివల్ల రాయచోటి చుట్టుపక్కల ప్రాంతాలుకూడా ఇక మీద బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అన్నాడు. అంతే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోని వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది అన్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రకటించడంలో రైతులు ఉద్యోగస్తులు,లాయర్లు,డాక్టర్లు ప్రజలు పోరాటం ఫలించింది అన్నారు.. అలాగే రాయచోటి లోని ప్రజాసమస్యలు తీర్చడానికి ఏ పోరాటానికైనా తాను సిద్ధంగా ఉంటానని ఈ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కొండారెడ్డి, జయరాం రెడ్డి, శివారెడ్డి మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author